పుట్టపర్తి:నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తికి వచ్చిన నారాభువనేశ్వరికి జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. పుట్టపర్తి నియోజకవర్గ మాజీ మంత్రి డాక్టర్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప,మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి , కందికుంట వెంకట ప్రసాద్‌ , సభితమ్మ,, జనసేన నాయకుడు పత్తి చంద్రశేఖర్‌ , సామకోటి ఆదినారాయణ ,తదితర టీడీపీ నాయకులు,జన సేన కార్యకర్తలు ఆమెకు స్వాగతం పలికారు.తరువాత ఆమె ప్రత్యేక కాన్వాయ్‌ లో పుట్టపర్తి మండలం గాజులపల్లి కి బయలు దేరారు. నారా భువనేశ్వరీ కి ఘన స్వాగతం పలకడానికి టీడీపీ కార్యకర్తలు,అభిమానులు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షలు ఆర్ధిక సాయం అందించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *