జగన్‌ పని అయిపోయింది
అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేసిన జగన్‌
శంఖారావం సభలో నారా లోకేష్‌
నరసన్నపేట:నరసన్నపేట శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. విూరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్‌ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్‌ రెడ్డి పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. 25 మందికి 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారు. వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని విమర్శించారు.
జగన్‌ రెడ్డికి వైకాపా ఎంపీలే ముఖం చాటేస్తున్నారు. జగన్‌ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారు, వారు బైబై జగన్‌ అని చెప్పే పరిస్థితి వచ్చింది. రంరోజుల్లో సిపిఎస్‌ రద్దుచేస్తానని చెప్పి, ఉద్యోగులను మాయచేసే జిపిఎస్‌ తెచ్చాడు, ఉద్యోగులు కూడా బైబై జగన్‌ అంటున్నారు.
ఇప్పుడు ఒక కొత్త పథకం తెచ్చారు, ఆ పథకం పేరు ఎమ్మెల్యేల ట్రాన్స్‌ ఫర్‌, ఒకరి ఇంట్లో చెత్త ఇంకోచోట బంగారం అవుతుందా? ఇక్కడ పనికిరానివారు పక్క నియోజకవర్గంలో ఎలా పనికొస్తారు, ఆరోజే జగన్‌ ఓటమి ఒప్పుకున్నారు. బాబాయ్‌ ని చంపింది ఎవరు? పిన్ని తాళిబొట్లు తెంపింది ఎవరు, ఇది జగనాసుర రక్తచరిత్ర. జగన్‌ సొంత తమ్ముడు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి వివేకాను చంపారు. రేపో మాపో జగన్‌ రెడ్డి కూడా జైలుకు వెళతారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చంపారని చెప్పారు, చార్జిషీటులో వారి ఎంపి అవినాష్‌ రెడ్డి పేరు ఉంది, రేపోమాపో జగన్‌ పేరు కూడా ఆ లిస్టులో చేరుకుంది. జగన్‌ తాగేది ప్రజల రక్తం. క్వార్టర్‌ పై రూ.25 జే`ట్యాక్స్‌ కట్టించుకుంటున్నారు. ఇది నేరుగా జగన్‌ జేబులోకి వెళుతోంది. మద్యం ద్వారా ఏడాది 9వేలకోట్లు చొప్పున అయిదేళ్లలో 45వేల కోట్లు మింగేశాడు. మద్యం తయారు చేసేది, అమ్మేది జగన్‌ రెడ్డే. జగన్‌ రెడ్డిని చూస్తే కటింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ గుర్తొస్తాడు. ఆయన బ్లూ బటన్‌ నొక్కి రూ.10 ఎకౌంట్లలో వేస్తే .. రెడ్‌ బటన్‌ నొక్కి వంద లాగేస్తున్నారు. కరెంట్‌ ఛార్జీలు, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అవకాశమిస్తే గాలిపైన కూడా పన్ను వేసే వ్యక్తి జగన్‌ రెడ్డి. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి ప్రజలను పీడిస్తున్నారు. అన్న క్యాంటీన్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌, చంద్రన్న బీమా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ రెడ్డి రద్దు చేశారు. ఏపీకి సంక్షేమాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్‌. ఆనాడు కిలో రూ.2కే బియ్యం ఇచ్చారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం కనెక్షన్లు ఇచ్చారు, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. వాలంటీర్లతో మనం సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, కార్యకర్తలంతా గతంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వారికంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చెప్పాలి. నేను 3,132 కి.విూ పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నాను. ఎటువంటి అనుమానం లేదు… వచ్చేది టీడీపీ`జనసేన ప్రభుత్వమే. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తాం. ప్రతి ఇంటికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణసౌకర్యం కల్పిస్తాం. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన శని జగన్మోహన్‌ రెడ్డి. 3రాజధానుల పేరుతో విశాఖను నాశనం చేశారు,రూ.500 కోట్లతో ప్యాలెస్‌ కట్టుకున్నారు. రైల్వే జోన్‌ కు కావాల్సిన భూమి కూటా కేటాయించలేదు. విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు అయిన స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు జగన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయనీయం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వారు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారు. రామతీర్థంలో శ్రీరాముడి తల తీసేస్తే ఇంతవరకు బాధ్యులపై చర్యలు లేవు. పెండిరగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తామని చెప్పి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని అన్నారు.
వంశధార, తోటపల్లి, నాగావళి ప్రాజెక్టుల పెండిరగ్‌ పనులు ఎక్కడవి అక్కడే ఉన్నాయి. మూతబడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదు. నరసన్నపేట నియోజకవర్గానికి రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. ఉద్దానం కిడ్నీ పేషంట్లకు డయాలసిస్‌ ఏర్పాటుచేసింది తెలుగుదేశం. అన్ని గ్రామాల్లో తాగునీరు అందించేందుకు కృషి చేశాం. మేం పనులు ప్రారంభిస్తే వాటిని నిలిపివేసిన దద్దమ్మ ప్రభుత్వం జగన్‌ రెడ్డిది. మన హయాంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేశాం. 2019లో ఒక్క అవకాశం పేరుతో వచ్చి నాశనం చేశారని అన్నారు.
ధర్మాన కృష్ణదాస్‌ గారిని భారీ మెజార్టీతో గెలిపించారు. నియోజకవర్గానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశారా?ఆయన పేరులో ధర్మాన ఉందిగానీ.. ఆయన చేసే పనులన్నీ అధర్మమే. అంగన్‌ వాడీ పోస్టులు, షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు కూడా అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు. సొంత పార్టీ కార్యకర్తలపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేయాలనే ఆలోచన తప్ప ఏనాడూ నియోజకవర్గం గురించి ఆలోచించలేదు. పట్టణంలో ఎర్రన్నాయుడు పేరుతో పార్క్‌ నిర్మిస్తే జేసీబీ తీసుకెళ్లి ధ్వంసం చేశారు అధర్మ కృష్ణదాసని అన్నారు.
టీడీపీ కార్యకర్తకు చెందిన వెంకటేశ్వరరావు షాపింగ్‌ కాంప్లెక్స్‌ ను ఏకపక్షంగా తొలగించారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి జరగలేదు. ఒక్క రోడ్డు వేయలేదు, ఒక్క ఇల్లు కట్టలేదు, ఒక్క ప్రాజెక్టు పూర్తిచేయని అసమర్థుడు ఈ అధర్మాన కృష్ణదాస్‌. టీడీపీ అధికారంలోకి బొంతు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులన్నీ పూరిచేస్తాం. వంశధార ప్రాజెక్టు పనులు కూడా పూర్తిచేస్తాం. పెండిరగ్‌ లో ఉన్న ధారా వంతెన బ్రిడ్జి పనులు కూడా పూర్తిచేస్తాం. కామేశ్వరపేట వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కావాలని పెద్దలు కోరారు. ఖచ్చితంగా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటాం. శ్రీముఖలింగ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. టీడీపీకి కార్యకర్తలే బలం, ఎంతోమంది పార్టీ మారినా కార్యకర్తలకు అండగా నిలిచారు. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశారం. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు రూ.100కోట్లు ఇచ్చి అండగా నిలచాం. మన పిల్లలకు కూడా చదివిస్తున్న వ్యక్తి చంద్రబాబునాయుడు. వైసిపి అధికారంలోకి వచ్చాక మనపై ఎన్నో కేసులు పెట్టి వేధించారు. నాపై 22 కేసులు పెట్టారు, ఎస్సీ,ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్‌ మర్డర్‌ కేసు పెట్టారు… అయినా నేను వెనక్కి తగ్గలేదు. పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించారు. స్టూల్‌, మైకులు లాక్కున్నారు. చీకటి జీవోలు తీసుకువచ్చారు. నాపై కోడిగుడ్లు వేస్తే మనవాళ్లు ఆమ్లెట్లు వేసి పంపారు. చంద్రబాబు ని తప్పుడు కేసుల్లో ఇరికించి అక్రమంగా అరెస్ట్‌ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. తొలుత 3వేల కోట్లు అన్నారు, తర్వాత 270 కోట్లు అన్నారు, ఇప్పుడు 27కోట్లు అంటున్నారు. చంద్రబాబు ఏనాడూ అవినీతి చేయలేదు. నిప్పులా బతికారు. అవినీతి ఆరోపణలపై జగన్‌ రెడ్డికి సవాల్‌ విసురుతున్నా. బహిరంగచర్చకు సిద్ధమా అని అడిగారు.
టిడిపి కేడర్‌ ను వేధించిన వారి పేర్లు రెడ్‌ బుక్‌ లో రాసుకున్నా. చట్టాలను అతిక్రమించి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారిపై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటామని కార్యకర్తలకు హావిూ ఇస్తున్నా. ఎన్టీఆర్‌ రాముడు, చంద్రబాబు దేవుడు, లోకేష్‌ వైకాపా పాలిట మూర్ఖుడు. వడ్డీతో సహా చెల్లిస్తాం. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమాలను కేడర్‌ కు ఇచ్చే సూపర్‌ `6 కిట్ల ద్వారా ప్రతి గడపకు తీసుకెళ్లాలి. ఎన్నికలకు 60 రోజులే సమయం ఉంది. సూపర్‌`6 హావిూలను ఇంటింటికీ వెళ్లాలి. ఎవరి బూత్‌ లో బాబు ష్యూరిటీ`భవిష్యత్‌ కు గ్యారంటీ బాగా జరిగిందో నాకు కంప్యూటర్‌ లో తెలుస్తుంది. మెరుగైన పనితీరు కనబర్చినవారికి నామినేటెడ్‌ పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తా. నా చుట్టూ, పార్టీ ఆఫీసుల చుట్టు కాదు.. ప్రజల్లో తిరగాలని పార్టీ కేడర్‌ ను కోరుతున్నానని అన్నారు.
చంద్రబాబును అక్రమ అరెస్ట్‌ చేస్తే పవన్‌ మనకు అండగా నిలబడ్డారు. పవన్‌ ను బోర్డర్‌ లో నిలిపేశారు. ఆనాడే సైకోను తరిమికొట్టాలని పవనన్న పిలుపునిచ్చారు.
హలో ఏపీ`బైబై వైసీపీ అని పవనన్న పిలుపునిచ్చారు. ఎటువంటి అపోహలకు తావులేకుండా ఇరుపార్టీల కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషిచేయండి. పార్టీ కార్యకర్తల బాధ్యత నేను తీసుకుంటా… ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా. మత్స్యకారులకు గత టీడీపీ ప్రభుత్వం ఎంతో ఆదుకుంది. సబ్సీడీ ద్వారా అన్ని అందించాం. ఆదరణ ద్వారా ఆదుకున్నాం. రెండు నెలలు ఆగితే.. నిలిచిపోయిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు అందజేస్తాం. మత్స్యకారుల కోసం ఫిషింగ్‌ హార్బర్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ లు కడతామని మత్య్సకారులకు హావిూ ఇస్తున్నానని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *