విజయవాడ, ఫిబ్రవరి 7:బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. బుధవారం అసెంబ్లీలో ఓట్‌ ఆన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్‌ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్నీ విస్మరించకూడదన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్‌ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్‌ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐదేళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ప్రసంగాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు.
బడ్జెట్‌ స్వరూపం..
వార్షిక బడ్జెట్‌ రూ. 2,86,389.27 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2,30,110.41 కోట్లు
మూలధన వ్యయం రూ. 30,530.18 కోట్లు
రెవెన్యూ లోటు రూ. 24,758.22 కోట్లు
ద్రవ్య లోటు రూ. 55,817.50 కోట్లు
జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
రెవెన్యూ లోటు 1.56 శాతం
రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయంలో గణనీయమైన ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ సమగ్ర వ్యూహాన్ని రూపందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం లభించింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద లక్షా 60 కౌలుదారులకు, 93 వేల అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 53 లక్షల 53 వేల మంది ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలు జమ చేసింది. వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాల్లో 7, 802 కోట్ల రూపాయల బీమా అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 2019 నుంచి 73 లక్షల 88 వేల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయలు అందించింది.
10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. 2019 నుంచి ఈ పథకం ద్వారా 37,374 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు విక్రయించే వారి కోసం 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 22 లక్షల 85 వేల మంది రైతులకు 1,977 కోట్ల రూపాయలు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలు ఈ నెలలో ఇయ్యబోతోంది. 127కొత్త వైఎస్‌ఆర్‌ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపయాలు కల్పించింది. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ యంత్రాలను అందిచేయడమే కాకుండా గ్రామ యువతకు డ్రోన్‌ పైలట్‌ శిక్షణ అందించారు. ఉద్యనవన రంగం అభివృద్ధి కోసం 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలు అందించాం. 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను నియమించింది. ంట నిల్వ కోసం 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్‌ హౌస్‌లును ఏర్పాటు చేసింది.
జగన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు లబ్ధి కలిగేలా అమూల్‌ సంస్థతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చేశాం. దీని వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది.వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించాం. వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతలకు ఇంటి వద్దే అందిస్తున్నాం. వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో 4 వేల నుంచి పది వేల వరకు ఆర్థిక సాయం చేస్తున్నాం. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్‌ ఆయిల్‌పై లీటర్‌కు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయల సబ్సిడీ పెంచడం జరిగింది. అకాల మరణానికి గురైన వారికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్బర్‌లు నిర్మించాం. గ్రామస్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి 35 సవిూకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 2000 ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌ దుకాణాలు స్థాపించాం. మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 1, 2022 నుంచి పని చేస్తోంది. జనాభాలో సగం మంది సంక్షేమ సాధికరాతకు నోచుకోని ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మహిళలకు సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా 2021`22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్‌ చైల్డ్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టి అందరికీ విద్య అందేలా చేస్తున్నాం. దీని కింద 43 లక్షల 61 వేల మంది మహిళలకు 26, 067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరే విద్యార్థుల సంఖ్య 2019 87.8 శాతం ఉంటే.. 2023 నాటికి అది 98.73శాతానికి పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 ఉంటే… 2023 నాటికి 79.69కి పెరిగింది. మహిళా సంఘాల బకాయిలు చెల్లించేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టాం. 2019 నుంచి 7 లక్షల 98 వేల స్వయం సహాయ సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళలు ఉపశమనం కల్పించాం. వారికి 25, 571 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. 18.36 శాతం గా ఉన్న బకాయిలు దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలకు 14,129 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3 లక్షల 60 వేల మంది మహిళలకు డెయిరీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2,697 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల, పిల్లల భద్రత కోసం దిశా మొబైల్‌ యాప్‌ను, దిశా పెట్రోల్‌ వాహనాలను, 26 దిశా పోలీస్‌ స్టేషన్‌లను ప్రారంభించాం. 2023`24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం కోస సంవరించిన అంచనాలు 2,28,237,77 కోట్లు అయితే మూల ధన వ్యయం కోసం 27,308.12 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 60,153.59 కోట్లు, ఇది జీఎస్‌డీపీలో వరుసగా 2.19 , 4.18 శాతంగా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణా సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయని భావించి… ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయటం చేస్తున్నాం. ఆరోగ్య కేంద్రం మొదలు కొని బోధనాసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24చీ7 పని చేసేలా రోజూ రెండు షిప్టుల్లో పనిచేసేలా పునరుద్దరించాం.
ప్రజలకు ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. మండలానికి కనీసం ఒక యూనిట్‌ చొప్పున 108 అంబులెన్స్‌ సర్వీసును, 104 సంచార ఆరోగ్య వాహన బృందాలను ఏర్పాటు చేశాం. ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయ అర్హత పరిమితిని 2 లక్షల 50 వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచాం. సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ వ్యాధుల పరిధిని కూడా 1,059 నుంచి 3,257కి పెంచాం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా చికిత్స తీసుకునేలా చేస్తున్నాం. కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ స్థాయి చికిత్స ఉచితంగా చేస్తున్నాం. 200 పడకల కిడ్నీ రీసెర్చ్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పలాసలో ఏర్పాటు చేశాం. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10, 574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలో కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మందులు అందించడం జరిగింది.
నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53, 126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పషలిస్టు వైద్యుల పోస్టుల ఖాలీలు సగట 61 శాతం ఉంటే.. ఏపీలో నాలుగు శాతమే ఉందన్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్‌ ప్‌ాలు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్‌ కాలేజీలు స్థాపించాం. దీని ద్వారా 2023`24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో లక్షా 6 మంది అభ్యర్థులు శిక్షణఇవ్వగా వీరిలో 95 శాతం మంది ఉద్యోగావకశాలు పొందారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వర్చువల్‌ ల్యాబ్‌లు, క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్స్‌, మారుతీ, టయోటా, ఇసుజు, హిటాచీ, సామ్సంగ్‌ సంస్థల సాయంతో అధునాతన యంత్రాలు యంత్ర పరికరాలు ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం గత ఐదేళ్లులో మానవ మాలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తట్టుకొని నిలబడే శక్తిని కల్పించింది. ప్రపంచస్థాయిపోటీకి సిద్దం చేయడానికి మా ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టింది. వెయ్యి పాటశాలల్లో చదువుకుంటున్న 4,39,595 మంది విద్యార్థులను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. అన్ని ప్రభుత్వం ఉన్నత పాఠశాలల్లో ఇంటర్‌నేషనల్‌ బాకలారియాట్‌ పాఠ్యప్రణాలిక కిందకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక విద్యార్థికి టోఫెల్‌ సర్టిఫికేట్‌ అందిస్తున్నాం.
విద్యాబోధనను సులభతరం చేసేందుకు 62 వేల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ను వినియోగంలోకి తీసుకొచ్చాం. స్వీయ అభ్యాసనను ప్రోత్సహించేందుకు పాఠ్యాంశాలతో కూడిన 9,52,925 ట్యాబ్‌లను ఇచితంగా విద్యార్థులకు అందించాం. దీని వల్ల 4వ తరగత నుంచి 12వ తరగతి వరకు 34 లక్షల 30 వేల మంది విద్యార్థులు మరింత ప్రతిభావంతులు అయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *