అమరావతి : ఏపీ అసెంబ్లీ రెండవ రోజు మంగళవారం జు సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. సభ ప్రారంభమైన వెంటనే నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో, టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. వాయిదా తీర్మానంపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేసారు. పెరిగిన ధరలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ అంశంపై చర్చించాల్సిందేనని పట్టుపట్టారు. అయితే టీడీపీ సభ్యుల అరుపులను స్పీకర్‌ పట్టించుకోలేదు. మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాల మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశ పెట్టారు. దీంతో, టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకు పోయారు. పోడియం ఎక్కి మరీ నినాదాలు చేశారు. స్పీకర్‌ ఛైర్‌ వద్దకు దూసుకువచ్చారు. దీంతో, టీడీపీ సభ్యులను అసెంబ్లీ నుంచి ఒక రోజు స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ తీర్మానాన్ని స్పీకర్‌ చదువుతున్న సమయంలో స్పీకర్‌ పోడియంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేసారు. బయటకు వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించినప్పటికీ… వారు అక్కడి నుంచి కదలలేదు. దీంతో, మార్షల్స్‌ వచ్చి వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *