విశాఖపట్నం: విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్‌ సానపల్లి రమణయ్య కొమ్మాదిలో చరణ్‌ కాస్ట్రల్‌ అపార్ట్‌ మెంట్‌ లో వుండగా శుక్రవారం అర్థ రాత్రి అపార్ట్‌ మెంట్‌ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్‌ మెన్‌ కేకలు వేయటంతో దుండగులు పారిపోయారు. వెంటనే హాస్పటిల్‌ కి తరలించగా చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. విశాఖపట్నం సీపీ రవి శంకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
నిజాయితీ పరుడుగా మంచి పేరు తెచ్చుకున్న రమణయ్య హత్యకి లాండ్‌ మాఫియా వివాదాలే కారణమని అనుమానిస్తున్నారు. నిందితులు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *