తాడేపల్లిగూడెం: వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్‌ తాడేపల్లిగూడెం అసెంబ్లీ తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో బుధవారం గ్రామపంచాయతీ ఆఫీస్‌ వద్ద జరిగినది. ఈ సభలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నాయకులు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్‌ ఈతకోట భీమశంకర రావు(తాతాజీ ) మాట్లాడుతూ నరేంద్ర మోడీ అంతోద్య అనే ఒక సూత్రాన్ని తీసుకొని పేద ప్రజలకి బడుగు బలహీన వర్గానికి అందుబాటులో ఉండాలని ఈ పథకాలను అమలు చేస్తున్నారని ఇవి అందరూ అందిపుచ్చుకోవాలని ప్రజలందరికీ ఆయుష్మాన్‌ భారత్‌, ఉచిత బియ్యం, (గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన ), ఉపాధి హావిూ పథకం, ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, కేంద్ర ప్రభుత్వ పథకాలు గూర్చి వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు అందరూ వీక్షించాలని తద్వారా దేశంలో జరిగే వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలను తాతాజీ తెలియజేశారు . ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కో కన్వీనర్‌ రామగాని సత్యనారాయణ నరసాపురం జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి నగేష్‌ , బిజెపి తాడేపల్లిగూడెం మండల ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాస్‌ , మండల యువమోర్చా అధ్యక్షులు రాంబాబు ఓబీసీ నాయకులు మారిశెట్టి నరసింహమూర్‌ ఇమ్మంది బెనర్జీ , ప్రభుత్వ అధికారులు మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని ఈ సభని విజయవంతం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *