నెల్లూరు, డిసెంబర్‌ 27: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలు ప్రారంభించాయి. అధికార వైసీపీ.. అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తూ.. కొత్తగా ఇంన్ఛార్జిలను నియమిస్తూ ఎలక్షన్స్‌ హడావుడిని మొదట స్టార్‌ చేసింది. అయితే.. గతేడాది 100 శాతం ఫలితాలను అందించిన నెల్లూరు జిల్లా వైసీపీలో అనేక కొత్త పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి. రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పోటీచేయనున్నారు. ఇప్పటికే ఆయనే అభ్యర్థిగా ప్రచారం కూడా స్టార్ట్‌ చేశారు. అయితే ఆయన జిల్లాలో మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలని హైకమాండ్‌ ను పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరిలో అభ్యర్థులను మార్చి తాను సూచించిన వారికి టికెట్‌ ఇవ్వకుంటే తాను ఎంపీగా పోటీ చేయనని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురిని మార్చుకుంటే నేను పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తెగేసి చెప్పినట్లు సమాచారం.నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఆయన బాబాయి రూప్‌ కుమార్‌ యాదవ్‌ మధ్య తీవ్రమైన విభేదాలున్నాయి. సీఎం చెప్పినా వీరి మధ్య పరిస్థితి చక్కబడలేదు. దీంతో పాటు, అనిల్‌ కుమార్‌ కు వ్యతిరేకంగా మరి కొందరు వైసిపి నేతలు మాట్లాడుతున్నారు. కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి రెడ్డి ప్రతాప్‌ కుమారెడ్డి, సుకుమార్‌ రెడ్డి మధ్య విభేదాలు ఇదే తీరుగా కొనసాగుతున్నాయి.ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్‌ రెడ్డితో.. ఐదుగురు నియోజవర్గ నేతలు కత్తులు దూస్తున్నారు. పార్టీ పెద్దలు నచ్చచెప్పినా అక్కడ పరిస్థితి మారడం లేదు. ఈ మూడు నియోజవర్గాల్లో సీఎం తోపాటు విజయసాయిరెడ్డి మరి కొందరు పెద్దలు స్థానిక నేతలతో మాట్లాడి రాజీచేసే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్న ప్రచారం ఉంది.ఈ నేపథ్యంలో తాను ఎంపీగా పోటీ చేయాలంటే ఈ మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలని వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *