విజయవాడ: కుండలు తయారుచేసే వాడు అమ్ముకోవాలని కానీ తన్న కూడదు. బీఆర్ఎస్కి, కి వైసీపీ కి సంబంధం ఏంటని సినీ రచయిత పొసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదు.ఆంధ్రప్రదేశ్లో పొత్తు ఉన్నారు కదా. చంద్రబాబు జైల్ లో ఉంటే పవన్ ధీమాగా టీడీపీకి సపోర్ట్ చేసాడు. టీడీపీ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాపు సోదరులు గమనించగలరు చంద్రబాబు కాపులని,పవన్ కళ్యాణ్ ని ముంచుతాడు. ఆంధ్రప్రదేశ్ల్ కూడా చంద్రబాబు,కాంగ్రెస్ కలిసి పోటీ చేయొచ్చు కదా. చంద్రబాబుకి కాపు ఓట్లు కావాలి కానీ అధికారం మాత్రం కాపులకి ఇవ్వడు. తెలంగాణలో జనసేన గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సీట్లు అడుగుతాడని చంద్రబాబు తెలంగాణలో జనసేనకి సపోర్ట్ చేయలేదు. చంద్రబాబుకి బుద్ది ఉందా గతంలో 23 ఎమ్మెల్యేలని ఎందుకు కొన్నావు. జగన్ ఎవరి సపోర్ట్ అవసరం లేదు ప్రజలు అండగా ఉంటే చాలని అన్నారు.