విజయవాడ, నవంబర్‌ 16: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం విద్యాకానుక పేరుతో రూ. 120 కోట్ల దోపిడీ చేసిందని జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో సాగుతున్న కుంభకోణాలు అక్రమాలపై రోజుకొకటి చొప్పున బయటపెడతామని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వారం కిందటే ప్రకటించారు. అందులో భాగంగా విద్యా శాఖలో స్కామ్‌ ను ఈ రోజు వెల్లడిరచారు. ప్రభుత్వ స్కూల్స్‌ లో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో రూ.120 కోట్లు దారి మళ్ళాయని ఇటీవల ఉత్తరప్రదేశ్‌, ఢల్లీిలో ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 5 కంపెనీలపై దాడులు చేసిందన్నారు. ఢల్లీిలో తీగ లాగితే ఆంధ్ర ప్రదేశ్‌ లో డొంక కదిలిందని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఉత్తరాంధ్ర నుంచి వయా తాడేపల్లి విూదుగా రాయలసీమకు ఇవి చేరాయా అని నాదెండ్ల ప్రస్నించారు. నిధులు ఎలా దారి మళ్ళాయి అనేదానిపై ఈడీ సమగ్ర విచారణ మొదలుపెట్టిందని.. 5 కంపెనీలు సిండికేట్‌ గా మారాయి అనేది అర్థం అవుతోందన్నారు. విద్యార్థులకు నాసిరకం బూట్లు, చిరిగిపోతున్న బ్యాగులు ఇస్తున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసం ప్రభుత్వ పెద్దలు లాలూచీపడ్డారు. ఇప్పటి వరకూ జగనన్న విద్యా కానుక పేరుతో రూ.2400 కోట్లు నిధులు వెచ్చించారని గుర్తు చేశారు. ఈ 5 కంపెనీలు వెనక ఎవరు ఉన్నారని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. పేద విద్యార్థుల పేరుతో కోట్లు దోచేస్తున్నారని.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నది 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ జగనన్న విద్యా కానుకకు పర్చేజ్‌ ఆర్డర్‌ పెట్టింది 42 లక్షలన్నారు. ఈ వ్యత్యాసంలో ఉన్న మొత్తం ఎటు పోతుందని ప్రశ్నించారు. విద్యాశాఖ శాఖ ముఖ్య కార్యదర్శి మాత్రం పెద్ద మాటలు చెబుతూ క్వాలిటీ వాల్‌ అని విద్యార్థులను మభ్యపెడుతున్నారు. గోడ విూద చూపించే వాటికీ విద్యార్థులకు ఇచ్చే బూట్లు, బ్యాగులకు సంబంధం ఉండటం లేదన్నారు. ఎడమ కాలుకి 3వ నెంబర్‌ సైజ్‌, కుడి కాలుకి 5వ నెంబర్‌ సైజ్‌ షూస్‌ ఇస్తున్నారని ఇదేం పద్దతని ప్రశ్నించారు. క్లాస్‌ వార్‌ అని చెప్పే జగన్‌ పేద విద్యార్థుల పేరుతో కోట్లు మళ్లిస్తున్నారు. పేద విద్యార్థులను, వారి తల్లితండ్రులను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. జగనన్న విద్యా కానుకపేరుతో స్కూల్‌ బ్యాగు, బట్టలు, షూస్‌ వంటివి ఇస్తున్నారు. అయితే అవి నాణ్యత లేనివి ఇస్తున్నారని..పెద్ద ఎత్తున డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని కొంత కాలంగా విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమలో ఢల్లీిలో ఈడీ జరిపిన దాడుల్లో ఏపీకి… ఈ విద్యా కానుక సరఫరా చేసిన కంపెనీల వివరాలు ఉన్నట్లుగా నాదెండ్ల మనోహర్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. రొజుకొకటి చొప్పుననాదెండ్ల మనోహర్‌ స్కామ్‌ బయటపెడతామని చెబుతున్నారు.
బినావిూలకే లబ్ది
ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పారిశ్రామిక విధానం సీఎం జగన్‌ బినావిూ కంపెనీలకు భూములు కట్టబెట్టడానికేనని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్‌ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్‌ విూట్లో ఇండస్ట్రీస్‌ శాఖలో కుంభకోణంపై శ్రీ నాదెండ్ల మనోహర్‌ వివరాలు వెల్లడిరచారు. వైసీపీ ప్రభుత్వ కేబినెట్‌ న్యూ ఇండస్ట్రియల్‌ లాండ్‌ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారలటలవతీణ. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు భూకుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్‌ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లీజుకు తీసుకున్నట్లుగా కాకుండా ఓనర్‌ కి మారిందన్నారు. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్‌ కి ధారదత్తం చేసి యజమానిని చేశారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్‌ గా వ్యవహరించబోతుందన్నారు. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్‌ కి కట్టబెట్టారన్నారు. ఇంతకీ ఈ ఇండోసోల్‌ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదేనన్నారు. అసలు ఇండోసోల్‌ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు మాత్రమే అయిందని.. అంటే ఏడాది కిందట సృష్టించిన డవ్మిూ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్‌ లాండ్‌ పాలసీ తెచ్చారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. రూ. లక్ష షేర్‌ క్యాపిటల్‌ పెట్టుబడి పెట్టిన ఇండోసోల్‌ కంపెనీకి ఒక సంవత్సరం ఏడు నెలల్లో రూ. 76 వేల కోట్ల ప్రాజెక్టులు సీఎం జగన్‌ కట్టబెట్టారని ఇప్పటికే విపక్షాలు తీవ్రమైన ఆరోపణలుచేశాయి. వేల కోట్ల ప్రాజెక్టులు సొంతం చేసుకున్న ఇండోసోల్‌ కంపెనీ ఇడుపులపాయలో పుట్టిందని చెబుతున్నారు. వేల కోట్ల పెట్టుబడులు చేజిక్కించుకుంటున్న ఇండోసోల్‌ కు చెందిన నర్రా విశ్వేశ్వర్‌ రెడ్ది జగన్‌ రెడ్డి బినావిూగా టీడీపీ, జనసేన కూటమి ఆరోపిస్తోంది. పెట్టుబడులు పెట్టిన అయిదు నెలల్లో ఇండోసోల్‌ నుంచి 49 శాతం షేర్లు అరబిందో గ్రూపు కొనేసిందని, మిగిలిన వాటిల్లో షేర్లు కొనుగోలు కోసం మరో జపనీస్‌ కంపెనీ వచ్చిందని, ఇది పెద్ద కుంభకోణమని టీడీపీ నేతలు గతంలో వివరాలు బయట పెట్టారు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్‌.. ఆ కంపెనీ భూములు లీజుకు కాకుండా పూర్తిగా అమ్మకం పద్దతిలో వేల ఎకరాలు ఇచ్చేసినట్లుగా బయట పెట్టడంతో రాజకీయంగా సంచలనం రేపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *