అవనీగడ్డ: కృష్ణాజిల్లా   చల్లపల్లి మండలం చల్లపల్లి లో జర్నలిస్ట్‌ కల్లేపల్లి చంద్ర ( సిటీ కేబుల్‌ చంద్ర) శుక్రవారం రాత్రి చల్లపల్లి ఎమ్మార్వో ఎంపీడీవో కార్యాలయం లో చెట్టుకు ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలతో అయన ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నా బిడ్డకి హాస్టల్‌ ఫీజు కూడా కట్టలేకపోయాను. అందుకే చివరికి ఇలా..’ అంటూ చంద్ర రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరినీ కలచి వేసింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *