జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తుండడం హర్షణీయమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎక్కడైనా , ఎవరికైనా ఏ అవసరం వచ్చినా, కుటుంభం కంటే సమాజానికి ప్రాధాన్యత ఇస్తూ విలువలుతో కూడిన జర్నలిజం చేస్తున్న జర్నలిస్టులందరికీ అభినందనలన్నారు.ఎన్నికల ముందు చెప్పిన విధంగా మ్యానిఫెస్టో లోని హామీలన్నింటినీ నూటికి నూరు శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అన్నారు.కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామనడం, జర్నలిస్టులకు మూడు సెంట్ల భూమిని పట్టాలుగా ఇస్తుండడం చాలా గొప్ప విజయమన్నారు.అక్రిడేషన్ పొందిన విలేఖరులందరికీ 3 సెంట్ల స్థలాలను ఇవ్వడం జరుగుతుందన్నారు.త్వరలో గౌరవ కలెక్టర్ ను కలిసి అనుకూలమైన స్థలాలను పరిశీలించి, జర్నలిస్టులు సంతోషం పొందేలా పట్టాలను అందచేయడం జరుగుతుందన్నారు.జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *