హైదరాబాద్‌ అక్టోబర్‌ 25: తెలంగాణ సంప్రదాయానికి ప్రతిబింబం అలయ్‌ బలయ్‌ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లోప్రారంబమైంది. ప్రతి ఏటా దసరా మరుసటి రోజు రాజకీయ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అలయ్‌ బలయ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో . జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు . కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, విూనాక్షీ లేఖి, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు జానారెడ్డి, కంభంపాటి హరిబాబు, రాధా కృష్ణన్‌, వీ.హనుమంతరావు, ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వారందరిని దత్తాత్రేయ శాలువాతో సన్మానించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *