హైదరాబాద్: కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందంతో నేడు ప్రజాభవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు సమావేశం అయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణ రావు, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు