అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఎక్విప్ మెంట్ మ్యాన్ ఫ్యాక్చరర్స్ తో కలిసి ‘‘మెస్సె ముంచన్ ఇండియా’’ సంస్థ
డిసెంబర్ 11 నుండి 14 వరకు గ్రేటర్ నోయిడాలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ‘‘భౌమాకోన్ ఎక్స్ పో ఇండియా’’ కు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందించారు.ప్రతీయేటా నిర్మాణ రంగంలో వస్తున్న అధునాతన పరికరాలు, టెక్నాలజీలను ప్రదర్శించే ఈ ఎక్స్ పోలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వెయ్యికి పైగా సంస్థలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శనకు పెడతాయని సంస్థ నిర్వాహకులు మంత్రికి వివరించారు. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించే ఈ ప్రదర్శనలో టెక్నికల్ సెషన్స్, ప్రాడక్ట్ సొల్యూష్యన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయని మంత్రికి వివరించారు.తేకాదు, రోజువారిగా ప్రదర్శనకు సంబంధించిన విజువల్ ప్రజెంటేషన్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చూపించిన ప్రతినిధులు.. యేటా నిర్వహిస్తున్న భౌమాకోన్ ఎక్స్ పో ఇండియాకు వస్తున్న స్పందన గురించి మంత్రికి వివరించారు. అంతేకాదు, ముఖ్యంగా టన్నెలింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలేజీల గురించి మంత్రికి వీడియో రూపంలో ప్రదర్శించారు.