న్యూ డిల్లీ జూన్ 6: కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపధ్యంలో ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక నియామకాల కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నివీర్ పధకంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.అగ్నివీర్ స్కీమ్ పట్ల ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని తమ పార్టీ కోరుకుంటోందని చెప్పారు.ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్కు లేఖ రాశారని గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, కానీ యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.