ముంబై జూన్‌ 1: గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ.కోటికిపైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్‌ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్‌, ఎక్సైజ్‌ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో చిన్నారుల ఆట బొమ్మలు చాక్లెట్లు, లంచ్‌ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.15 కోట్ల విలువైన డ్రగ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *