ఒంటిమిట్ట చెరువుకి జలకళ

రామయ్య చెంతకు గంగమ్మ పరవళ్ళు

నీటిని విడుదల చేసిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజు.

ఒంటిమిట్ట మండలం/రాజంపేట నియోజకవర్గం.

ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్టలోని చెరువుకు జలకల సంతరించుకుంది. శ్రీరామ ఎత్తిపోతల పథకంలో భాగంగా మంగళవారం నాడు ఒంటిమిట్ట చెరువుకి రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు గంగా హారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంటిమిట్టలో వచ్చే భక్తులకు అన్ని విధాలా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని, అలాగే ఒంటిమిట్ట చెరువులో నీటిని నింపి రామయ్య చెంత గంగమ్మను నిలిపే అవకాశాన్ని తనకు కల్పించిన జిల్లా అధికారులకు,రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబుకు, మంత్రివర్యులు నారా లోకేష్ కు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

ఈకార్యక్రమంలో ఒంటిమిట్ట ఇరిగేషన్ ఏ.ఈ వాసుదేవ రెడ్డి,రాష్ట్ర కల్లుగీత కార్మిక మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,యువ నాయకులు హరినాథ్ రెడ్డి,శివారెడ్డి, మోదుగుల నరసింహులు, చౌడయ్య,శరత్ రెడ్డి,ఈశ్వరయ్య,మైనారిటీ నాయకులు మౌలాలి,బాల మునయ్య,రోశయ్య, అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *