రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సివిల్‌ సప్లయిస్‌ డీటీ చెన్నూరి శ్రీనివాస్‌
మచిలీపట్నం:సివిల్‌ సప్లయిస్‌ డీటీ చెన్నూరి శ్రీనివాస్‌ పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైస్‌ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల నెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్‌ మిల్లు యజమాని కామిరెడ్డి వినయ్‌ కుమార్‌ ని డీటీ డిమాండ్‌ చేసాడు. రైస్‌ మిల్లు యజమాని ఫిర్యాదుతో మచిలీపట్నం బైపాస్‌ రోడ్డులోని పెట్రోలు బంక్‌ వద్ద ఈ నెలకు సంబంధించి 10వేలు ఇస్తుండగా ఎసీబీ అధికారులు దాడి చేసారు. ఎసీబీ ఎఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో దాడి జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎసీబీ ఎఎస్పీ స్నేహిత తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *