తిరుపతి:తిరుపతిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ లో జనసేన `బిజెపి`టిడిపి నేతలతో పవన్‌ కళ్యాణ్‌ భేటి అయ్యారు. ఆయనకు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును కలిసికట్టుగా గెలిపించాలని నేతలకు సూచనలిచ్చారు. వేర్వేరుగా ఉండడం వల్ల నష్టపోతామన్న పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. తిరుపతిలో జనసేనపార్టీ జెండాను ఎగురవేద్దామని పవన్‌ కళ్యాణ్‌ కోరారు. వైసిపి అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేయాలన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించమని రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందని పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *