కోవూరు: నెల్లూరు జిల్లాలో వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి సిద్ధం సభ బస్సు యాత్ర 9వ రోజు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. క్యాంప్‌ సైట్‌ నుండి కావలికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి చింతా రెడ్డిపాలెం కోవూరు వద్ద ఘన స్వాగతం పలికారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు మరియు రాజుపాలెం వద్ద పెద్ద ఎత్తున ప్రజలు జాతీయ రహదారి పైకి తరలివచ్చారు. బస్సు పైకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు అభివాదం తెలియజేశారు. వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తో పాటు బస్సు పైకి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *