రాయచోటి 30 మార్చి 2024: ఉత్కంఠ భరితంగా శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సాగిన రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది ఎన్. ప్రభాకర్ రెడ్డి రాయచోటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు శనివారం రాయచోటి బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. రాయచోటి బార్ లో 81 మంది ఓటు హక్కు కలిగి ఉండగా ఎన్ ప్రభాకర్ రెడ్డికి 47 ఓట్లు వచ్చాయి . ప్రత్యర్థి అయిన కే రవిశంకర్ కు 33 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా ట్రెజరర్ పోస్టుకు వేల్పుల సిద్దయ్య ఎం వెంకటరమణ పోటీ పడగా సిద్దయ్యకు 45 ఓట్లతో గెలుపొందారు. ప్రత్యర్థి ఎం వెంకటరమణకు 35 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంతకుమునుపు ప్రధాన కార్యదర్శిగా పి. రెడ్డయ్య సహాయ కార్యదర్శిగా డి .నాగముని , ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

ఫోటో:అధ్యక్షుడు: N. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి: పి రెడ్డయ్య

,సహాయ కార్యదర్శి: D. నాగ ముని కోశాధికారి : V. సిద్దయ్య

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *