న్యూ డిల్లీ ఫిబ్రవరి 22:సెంట్రల్‌ వెనిజులాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న ఓపెన్‌ పిట్‌ బంగారు గని ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్స్‌ల్లో సవిూప ఆస్పత్రులకు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఆంగోస్తురా మునిసిపాలిటీలో మంగళవారం ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. బుల్లా లోకా అనే ప్రాంతంలోని గనిలో గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు 23 మంది మృతదేహాలను వెలికి తీశామని, మరో 11 మంది గాయపడినట్లు తెలిసిందని బొలివర్‌ రాష్ట్ర గవర్నర్‌ ఏంజెల్‌ మార్కానో అక్కడి విూడియాకు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై వెనిజులా ప్రెసిడెంట్‌ నికోలస్‌ మదురో స్పందించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. శిథిలాల కింద ఉన్నవారిని గుర్తించి, రక్షించాలన్నారు. సివిల్‌ డిఫెన్స్‌ బృందాలను ఇప్పటికే పంపామని తెలిపారు. బొలివర్‌ గవర్నర్‌ ఏంజెల్‌ మార్కానోతో మాట్లాడి, సహాయక చర్యలపై ఆరా తీసినట్లు ప్రెసిడెంట్‌ పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *