అనంతపురం:ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి విూద కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ కేకేఏన్ అన్బురాజన్ వెల్లడిరచారు. దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం. ఇందులో పోలీసులు నిర్లక్ష్యం ఉందన్న ఆరోపణల విూద అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో ఎంక్వయిరీ చేయిస్తున్నాం. పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కూడా చర్యలు ఉంటాయి. ఉరవకొండలో పత్రికా విలేకరులపై జరిగిన దాడి విూద కూడా వెంటనే చర్యలు తీసుకున్నాం. ఆ ఘటనలో 15 మందిని అరెస్టు చేసి.. బైండోవర్ చేశాం. పత్రికా విలేకరుల రక్షణ మా బాధ్యత…వారు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునేందుకు ఖచ్చితంగా సహకరిస్తాం. విలేకర్లపై ఎవరైనా దాడులు చేసే అవకాశమున్నా… బెదిరించినా వెంటనే మాకు సమాచారం చేరవేయండి… ముందస్తు చర్యలు తీసుకుంటామని అన్నారు.