పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం
హైదరాబాద్‌ ఫబ్రవరి 13:శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు. మేడిగడ్డ పర్యటన ద్వారా తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్‌ రావు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లబ్ధిపొందిన ప్రజలను అడగాలని ప్రభుత్వానికి సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారని చెప్పారు.అయినా కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదని.. అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌ స్టేషన్లు, 21 పంప్‌ హౌస్‌లు, 203 కిలోవిూటర్ల సొరంగాలు, 1,531 కిలోవిూటర్ల గ్రావిటి కెనాల్‌, 98 కిలోవిూటర్ల ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టిఎంసీల స్టోరేజ్‌ కెపాసిటీ, 530 విూటర్ల ఎత్తుకు లిఫ్ట్‌, 240 టీఎంసీల ఉపయోగం కలగలిసిన సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. ఒక్క బ్యారేజీలో ఒకటి రెండు కుంగిపోతే కోడిగుడ్డు విూద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.మేడిగడ్డ సందర్శనలో భాగంగా విూరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్‌, మల్లన్నసాగర్‌, కుడెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలన్నారు. కాళేశ్వరం ఫలితాలను గురించి రైతులను అడగాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రంగనాయకసాగర్‌ను చూసి అద్భుతమని మెచ్చుకున్నారని గుర్చుచేశారు. ప్రాజెక్టును సరిదిద్దే ప్రయత్నం చేయాలని సూచించారు. విచారణ చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. చాప్రాల్‌ వైల్డ్‌ లైఫ్‌ ప్రాంతంలో ప్రాణహిత కట్టాలని చూస్తే అనేక అడ్డంకులు వస్తాయని చెప్పారు. నాడు కేంద్రం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. ప్రాణహిత చేవెళ్లను ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. తాము నీళ్లు లేని ప్రాంతం నుంచి ప్రాజెక్టును తరలించి పంటలకు నీళ్లు అందించామన్నారు. మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల పంట పండిరదంటే ఆ జలాల వల్లే జరిగిందని స్పష్టం చేశారు.కాంగ్రెస్‌ హయాంలో పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ కూలి 20 మంది చనిపోయారని, దేవాదుల పైపులు పేలి నీళ్లు ఆకాశమంత ఎగిరాయన్నారు. అలాంటి ఘటనలు జరగడం బాధాకరమని చెప్పారు. కానీ తాము ముందుకు వెళ్లాం కదా అని తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించొద్దని తాము నిద్ర లేపితే లేచారని, ఈ రోజు బీఆర్‌ఎస్‌ సభ ఉందని విూరు డైవర్ట్‌ చేయడం కోసం పోటీ కార్యక్రమం పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నీతిని ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *