అదిలాబాద్‌: లక్ష రూపాయలను కోటి రూపాయలుగా మారుస్తామంటు బురిడీ కొట్టిస్తు ఘరానా మోసానికి పాల్పడుతున్న ముఠాను ను ఇచ్చోడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వటర్‌ లు, చీరలు అమ్మేముసుగులో జిల్లాలో కొన్ని చోట్ల గమధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ముఠా మకాం వేసింది. అమాయకులే లక్ష్యంగా గ్రామాలలో జల్లెడ పట్టింది. సిరికొండ మండలం రాజంపేట్‌ గ్రామానికి చెందిన ఓ ఆదివాసివ్యక్తికి లక్షలలో ఉన్న డబ్బులను రెట్టింపు చేసి కోట్లలో మారుస్తామని నమ్మబలికింది. బాధితుడు గంపెడాశలతో నిందితులకు 3 లక్షల రూపాయల నగదును ముట్టజెప్పాడు. బాధితుడి 3 లక్షలరూపాయల నగదును తీసుకునినిందితులు ఉడాయించారు. రోజులు గడుస్తున్న డబ్బులు తీసుకున్న వ్యక్తులు తిరిగి రాకపోవడంతో బాధితుడు పోలిసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం బృందాలుగా అన్వేషంచి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. అత్యాశతో ఎవరినైనా నమ్మి నష్టపోవద్దని పోలిసులు సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *