ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు నవ దంపతులు లేలంగి లక్ష్మీనారాయణ, గాయత్రి సముద్రంలో మునిగిపోయారు. వారిద్దరికి నెల రోజుల క్రితం పెళ్లి అయింది. కార్తికమాసం సందర్భంగా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుంటామని ఇంటి దగ్గర చెప్పి వచ్చారు. ఇద్దరు చేతులకు చున్నీ కట్టుకుని అంతర్వేది బీచ్ సవిూపంలో 500 విూటర్ల దూరంలో అందరూ చూస్తుండగానే సముద్రంలోకి యువజంట వెళ్లిపోయింది. సవిూపంలో ఉన్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా వారి జాడ తెలియరాలేదు. ఒడ్డున వదిలిన ఫోన్ ఆధారంగా సఖినేటిపల్లి పోలీసులు పేరెంట్స్ కు ఇన్ఫార్మ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.