పులివెందుల:భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌ సీఎం జగన్‌పై కడప జిల్లా పులివెందులలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌ అవినీతిపై విచారణ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. . అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి జగన్‌ వరకు అంతా కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. పులివెందుల వాసి సీఎం జగన్‌.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దోచుకోవడం మొదలుపెట్టారని ఆరోపించారు.మద్యం ద్వారా 50 వేల కోట్లు, గ్రానైట్‌లో 30 వేల కోట్లు, ఇసుక ద్వారా 12 వేల కోట్లు, పారిశ్రామిక, చుక్కల భూముల ద్వారా 20 వేల కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా 9 వేల కోట్లు, ఎర్రచందనం ద్వారా 15 వేల కోట్లు, విద్యుత్‌ ఒప్పందాలు, కొనుగోళ్లతో రూ.10 వేల కోట్లు దోచుకున్నారు. పోర్టులు, అమూల్‌, బైజూస్‌ నుంచి కవిూషన్లు, సినిమా, ఇతర పరిశ్రమల నుంచి వాటాలు.. ఇలా రూ.1.65 లక్షల కోట్లు వెనకేశారని ధ్వజమెత్తారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *