రాజంపేట పట్టణం:   తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా న్యాయదేవత ఫోటో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అని స్వరం వినిపించిన జగన్ మోహన్ రాజు.న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్న న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుందన్నారు.

కళ్ళు ఉన్న వైసిపి నియంత పాలకులు గుడ్డివాడి లాగా అభివృద్ధి సంక్షేమం చూడలేదన్నారు.అభివృద్ధి ,సంక్షేమం అని అడిగితే బూతులు తిడతారు.అక్రమ కేసులు పెడతారు.కానీ న్యాయ దేవత ఎల్లప్పుడూ నిజాయితీపరుడు చంద్రబాబు వైపు ఉంటుందన్నారు.చంద్రబాబు కు ఉన్న ప్రజా మద్దతు కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ద్వారా అవినీతితో కళ్ళు మూసుకుపోయిన నియంతకు పాలకులకు తెలియజేసామన్నారు.నిజం గెలవాలి అనే మన  నినాదం  తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపిచిందన్నారు.ఈకార్యక్రమంలో టిడిపి సర్పంచ్ కోటయ్య నాయుడు,మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, భాస్కర్ రెడ్డి,శివ,మురగరాజు, సూర్యనారాయణ రాజు,నాగేంద్ర తులసి,రామ్మోహన్, మహిళా నాయకురాలు సుభద్ర,కంటా శివ,సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *