గుల్బర్గా:కర్ణాటకలోని గుర్మిట్కల్‌ ఎన్నికల ప్రచార సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రసంగించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారు.. 1972లో మొదటిసారిగా విూరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే గారు… ఏఐసీసీ అధ్యక్షుడుగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుర్మిట్కల్‌ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. విూరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిరది. ఐదు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వం. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నాం. పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హావిూలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారని అన్నారు.
40కోట్ల ఖాతాలు తెరిపించిన మోదీ… ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు. కర్ణాటక నుంచి 26ఎంపీలను ఇస్తే… మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్‌ పదవి. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఏవిూ లేదు.. ఖాళీ చెంబు తప్ప. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారు. అలాంటి మోదీని ఓడిరచాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ ను గెలిపించుకోవాలి. సమర్ధుడు, విూ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండని కోరారు.ఇక్కడ కాంగ్రెస్‌ కు ఒక్క ఓటు వేస్తే… ఇక్కడున్న ముగ్గురు నాయకులు విూకు సేవ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌ కు ఓటు వేయండి. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ ను గెలిపించండి. లక్ష మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్‌ ను గెలిపించండని అన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *