పిఠాపురం:జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ను పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని జబర్దస్త్‌ ఫేం,సినీ హాస్యనటుడు హైపర్‌ ఆది అన్నారు.పిఠాపురం పట్టణం 2,3 వార్డుల్లో పవన్‌ కళ్యాణ్కు మద్దతుగా స్టార్‌ క్యాంపెయినర్‌ హైపర్‌ ఆది ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ముందుగా శ్రీ గణపతి సచ్చిదానందస్వామిజీకి చెందిన అనఘా దత్తక్షేత్రంలో హైపర్‌ ఆది ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి,గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పవన్‌ కళ్యాణ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ప్రముఖ కాంట్రాక్టర్‌ సూరవరపు దివాణం హైపర్‌ ఆదిని ఘనంగా సన్మానించారు.అదేవిధంగా ఆదికి గ్లాసులను అందజేశారు.ఈ సందర్భంగా స్టార్‌ క్యాంపెయినర్‌ హైపర్‌ ఆది విూడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వీరమహిళ చల్లా లక్ష్మి,జనసైనికులు దానం లాజర్‌ బాబు,జోగా వేంకటరమణయాదవ్‌,రెడ్డెం రమేశ్‌,చెల్లుబోయిన సతీశ్‌,మార్నీడి రంగబాబు,సూరవరపు కృష్ణార్జునరావు,పల్నాటి మధుబాబు,టీడీపీ నాయకులు గిరీశ్‌ వర్మ,సోము సత్తిబాబు,జనపరెడ్డి రాంబాబు,బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు,కర్నీడి తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *