ఆళ్లగడ్డ:ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్‌ రాష్టంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరం చూస్తున్నాం. ఆళ్లగడ్డ లో రైతులనీ నాయకులే ఇబ్బందులు పెడుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని రౌడీయజం గుండాయజం చేస్కుంటూ రైతులను భయపెడుతున్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఎమ్మెల్యే గా నువ్వు ఆళ్లగడ్డ కూ ఎం చేసావ్‌ . ని కుటుంబ సభ్యులు రైతులను భయపెట్టి లక్షలు వసులు చేస్తున్నారు.నా సొమ్ము తిన్న వాళ్ళతో నువ్వు మాట్లాడిస్తున్నావు. తొందరలోనే అన్నింటికీ లెక్క చెప్తా. జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖముకి కార్యక్రమం పై వచ్చారు. ఏ ఒక్క రైతు గురించైనా మాట్లాడారా…? ఎందుకు ఇరిగేషన్‌ సలహాదారు కార్‌ లో కూర్చున్నారని అన్నారు.
చంద్రబాబు ముందే నేను చెప్పాను ఆళ్లగడ్డ ఎంత నీచమైన రాజకీయం చేస్తున్నారని. ఓ పక్క ఆళ్లగడ్డ తాలూకాలో నీళ్లు లేవని రైతులు లేబడిబొమంటుంటే నీ తల్లి యర్రగుడి దీన్నే చెరువులో నీళ్లు వదిలి చేపలు పడుతున్నది విూరు కాదా….? దేవుడిపై ప్రమాణాలు వేస్తే అపద్దాలు నిజాలు అయిపోతాయా…? మేము ప్రతిపక్షం లో ఉండి కూడా కలెక్టర్‌ తో కొట్లాడి వేల ఎకరాలకూ నీళ్లు తెప్పించా. నాపై అసత్య ఆరోపణలు చేయడం పోలీసులతో అక్రమ కేసులు పెట్టించడం తప్ప విూకేం చేతకాదు. ఒక్క ఛాన్స్‌ ఇస్తే ఆళ్లగడ్డను మొత్తం అతలాకుతలం చేసారు. ఆళ్లగడ్డకు ఎంత నీటి సమస్య వస్తే విూకు అంత కమిషన్‌ బాగుంటుంది. సవాల్‌ కూ రమ్మంటావ్‌ నేను వస్తా అంటే పోలీసులతో హౌస్‌ అరెస్టు చేస్తావ్‌. నువ్వు చేసిన అభివృద్ధి గురించి 10 నిమిషాలు మాట్లాడు నేను నువ్వు నాయకునివని ఒప్పుకుంటా. నువ్వు చేసిన అక్రమాలపై నేను ఆధారాలతో 30 నిముషాలు మాట్లాడతా. విూ దగ్గర పని చేసేవాళ్లనే ఎంత దారుణంగా తిట్టారో వాయిస్‌ రికార్డు తో సహా బయట పెడతా. ఆళ్లగడ్డలోని ప్రతి గ్రామంలో గంగుల వర్గాన్ని లేకుండా చేస్తానని అన్నారు. త్వరలోనే ఆళ్లగడ్డ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *