శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది
సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది
మే 13న జరిగే ఓట్ల సునావిూ ఎలా ఉంటుందో
అనంతపురంలో కియా మన బ్రాండ్‌…
జాకీ పారిపోవడం జగన్‌ రెడ్డి బ్రాండ్‌
దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు
వివేకా హత్యపై జగన్‌ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్‌ రెడ్డి
నీళ్లు ఇస్తే బంగారం పండిరచగల భూములు అనంతపురం సొంతం
మనం మహాశక్తితో ఆడబిడ్డను గౌరవిస్తే.. జగన్‌ రెడ్డి సొంత చెల్లెళ్ల పుట్టుకనూ ప్రశ్నిస్తున్నాడు
యువత తమ భవిష్యత్తు కోసం ముందుకు రావాలి.. పోరాడాలి
అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం ‘ప్రజాగళం’ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
పు ఎన్నికల్లో గెలుస్తున్నాం. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
శింగనమలలో ఈ సారి పసుపు జెండా ఎగరేయబోతున్నామని ఇక్కడకొచ్చిన జనం చూస్తే అర్ధమైపోతుంది.
ఈ ఎన్నికలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మార్చే ఎన్నికలు.
సభకు వచ్చిన ప్రజా ఉదృతి చూస్తుంటే మే 13న జరగబోయే ప్రజా సునావిూ కళ్లకు కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నెమరు వేసుకునని ఓటు వేయాలి.
నరకాసుర వధ చేసి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవానికి గడువు 46 రోజులు మాత్రమే. బటన్‌ నొక్కా అని చెప్పే జగన్‌ రెడ్డి.. బటన్‌ నొక్కి వేస్తున్నదెంత, బొక్కుతున్నదెంతో సమాధానం చెప్పాలి.
ఐదు సంవత్సరాల్లో జరిగిన అన్యాయం, దోపిడీ గురించి ప్రతి ఇంట్లో చర్చ జరగాలి.
రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్న జలగ ఈ జగన్‌ రెడ్డి.
కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన జగన్‌ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వరుసగా పెంచుకుంటూ పోయాడు. టీడీపీ హయాంలో రూ.200 ఉండే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 అయ్యింది. దీనిపై చర్చించాలి.
పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెరిగాయో, ఎంతలా పెరిగాయో ప్రజలు ఆలోచించుకోవాలి.
చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జలగ. మద్యం క్వార్టర్‌ అప్పుడు రూ.60 ఉంటే.. ఇప్పుడు రూ.200 చేశాడు. ధరలు పెంచి, పేదల రక్తం తాగుతూ, తాడేపల్లి కొంప నింపుకుంటున్నాడు. కల్తీ మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. రేట్లు పెంచుకుంటూ పోవడం ద్వారా మద్య నిషేధం చేస్తానంటూ ప్రజల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
వీరోచితంగా పోరాడే యువత మన రాష్ట్రంలో ఉన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అన్నాడు. మెగా డీఎస్సీ అన్నాడు. ఐదేళ్లు పూర్తౌెంది. ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. జాబ్‌ క్యాలెండర్‌ ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడేనా?
మనం వస్తే పెట్టుబడులొస్తాయి. పరిశ్రమలొస్తాయి. ఉద్యోగాలొస్తాయి. అనంతపురంలో కియా మన బ్రాండ్‌. జాకీ పారిపోయిందంటే అది జగన్‌ రెడ్డి బ్రాండ్‌. పెట్టుబడులు తరిమేయడం జగన్‌ పని.. పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉద్యోగాలివ్వడం మన బ్రాండ్‌. ముఖ్యమంత్రిగా నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే.
పిల్లలకు ఉద్యోగాలివ్వడం లేదు. గంజాయి, మద్యం, డ్రగ్స్‌ తెచ్చి యువత జీవితాలను నాశనం చేస్తున్నాడని అన్నారు.
పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ఆలోచిస్తారు. బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సాధించాలనుకుంటారు. జగన్‌ రెడ్డి అనే దుర్మార్గుడి పాలనలో ఉద్యోగాల్లేక మద్యం, గంజాయి, డ్రగ్స్‌ కి అలవాటు చేస్తున్నాడు.
ఓటింగ్‌ రోజున గ్రామాలన్నీ ఏకం కావాలి. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏకం కావాలి. మన భవిష్యత్తు కోసం అందరమూ పని చేయాలి.
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన, సర్వ నాశనం చేసిన జగన్‌ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టి భవిష్యత్తును కాపాడుకుందాం.
ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి సైకిల్‌ గుర్తుకి ఓటు వేయించేలా ఒప్పించాలి. భవిష్యత్తుకు గ్యారెంటీ కల్పించాలి.
జగన్‌ రెడ్డి అరాచకానికి ప్రతి వర్గమూ నష్టపోయింది. రైతులు, వ్యాపారులు, కూలీలు, ట్రాన్స్‌ పోర్టు రంగమూ నష్టపోయింది.
నష్టపోయిన ప్రతి రంగమూ అభివృద్ధిలోకి రావాలంటే, లాభాల్లోకి రావాలంటే తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి.
దళితులందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో 1996`97లోనే ఏ, బీ, సీ, డీ వర్గీకరణ తీసుకొస్తే. దాన్ని రాజశేఖర్‌ రెడ్డి నాశనం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ చేసేందుకు ముందుకు రావడం సంతోషకరం.
సామాజిక న్యాయం చేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ప్రజలు తెలుసుకోవాలి.
దళితులకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి దళితుల గొంతు కోశాడు. దగా చేశాడని అన్నారు.
దళితుల కోసం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలు రద్దు చేశఆడు. సబ్‌ ప్లాన్‌ నిధులు దారి మళ్లించాడు. కార్పొరేషన్లు నిర్వీర్యం చేశాడు. బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్స్‌, కులాంతర వివాహాలు సహా అన్ని దళిత పథకాలు రద్దు చేశాడు.
విదేశాల్లో చదువుకునే వారికి అంబేద్కర్‌ విదేశీ విద్య తీసుకొస్తే.. అంబేద్కర్‌ పేరు తీసి ఈ దుర్మార్గుడి పేరు పెట్టుకున్నాడు.
దళితులకు స్వాతంత్య్రం లేదు. నిలబడి మాట్లాడే పరిస్థితి లేదు. అహంకారంతో దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడు. 6వేలకు పైగా తప్పుడు కేసులు పెట్టాడు. 180 మంది దళితుల్ని హత్య చేశాడు.
కాకినాడలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేస్తే.. హంతకుడి భుజాలపై చేతులేసుకుని ప్రోత్సహిస్తున్నాడు.దళితులంతా ఏకం కావాలి. దళితులకు న్యాయం చేసే ఏకం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వెన్నెముక బీసీలు. వారికి ఈ పార్టీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది. భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రోత్సహించే ఏకైక పార్టీ తెలుగుదేశం.
జగన్‌ రెడ్డి రాగానే బీసీలకు అమలు చేసిన 30కి పైగా పథకాలు రద్దు చేశాడు. ఆదరణ, కార్పొరేషన్‌ రుణాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోతతో ఎవరూ చేయనంతటి దగా చేశాడు.

మే 13 తర్వాత జగన్‌ రెడ్డి అహంకారం కూలిపోతుంది. పెత్తనం పడిపోతుంది. అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్‌ బద్దలు కొడతాం.సిద్ధం అంటూ రోడ్డెక్కిన నిన్ను ఓడిరచడానికి ప్రజలంతా సిద్ధం. కాస్కో జగన్‌ రెడ్డీ.
రావణుడు కూడా నాకంటే గొప్పోడు లేడన్నారు. కానీ, చివరికి రాముడి చేతుల్లో ఏమయ్యారో తెలుసుకో.

రైతుని రాజు చేయడమే నా ధ్యేయం. అనంతపురం జిల్లా రైతాంగానికి ఉన్నన్ని అవకాశాలు ఇంకెక్కడా లేవు. నీళ్లు ఇస్తే.. బంగారం పండిరచగల భూములున్నాయి. గతంలో డ్రిప్‌ ఇస్తే.. మూడు నాలుగు రకాల పంటలు పండిస్తున్నారు.

అనంతపురం జిల్లాకు పుష్కలంగా నీరు అందిస్తే దేశంలోనే ది బెస్ట్‌ నియోజకవర్గం అవుతుంది. ప్రతి రైతుకు అన్నదాత పథకంతో ఏటా రూ.20 వేలు ఇస్తా. డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకంతో పనిముట్లన్నీ మళ్లీ అందిస్తా.
యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. అంత వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తా.
ఇళ్లలో కూర్చుని ప్రపంచంలో కూర్చుని పని చేసుకునేలా మండల కేంద్రాల్లో వర్క స్టేషన్లు కట్టిస్తా. స్కిల్‌ డెవలప్మెంట్‌ కేంద్రాలతో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాను.
? ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తా. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాను.
ఎన్టీఆర్‌ రూ.30తో పెన్షన్‌ ఇచ్చారు. నేను రూ.75 చేశాను. 2014లో అధికారంలోకి వచ్చే నాటికి రూ.200 ఉన్న పెన్షన్‌ రూ.2000 చేశాను. ఆ నిజాన్ని కూడా జగన్‌ రెడ్డి ఒప్పుకోలేకపోతున్నాడు.
? అధికారంలోకి రాగానే పెన్షన్‌ మొత్తాన్ని రూ.4000కు పెంచుతాను. మూడు నెలల పెన్షన్‌ ఒకేసారి తీసుకునేలా నిబంధనలు మారుస్తాను. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అమలు చేస్తాను.
శింగనమలలో దెంతులూరు వద్ద సెంట్రల్‌ యూనివర్శిటీ పనులు నిలిచిపోయాయి. కేంద్రంతో మాట్లాడి పనులు పూర్తి చేస్తాని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *