మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్‌
రెండు నెలలక్రితం కాంగ్రెస్‌ లో చేరిన ఆయన తిరిగి వైఎస్సార్‌ పార్టీలో జాయిన్‌
అమరావతి ఫిబ్రవరి 20:మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చారు. వైఎస్‌ షర్మిల సమక్షంలో రెండు నెలలక్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన తిరిగి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జాయిన్‌ ఇచ్చారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ కండువాను కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డి రాజకీయంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారుతున్నట్టు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకి చెప్పలేదని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి జగన్‌ ఓడిరచాలని చూస్తున్నాయని అన్నారు. ‘‘ 2024లో వైసీపీ 175 సీట్లు గెలుస్తాం. 25 పార్లమెంట్‌ గెలుస్తాం’’ అని ఆయన దీమా వ్యక్తం చేశారు.‘‘ నేను తిరిగి వైసీపీలో జగన్‌ దగ్గర చేరాను. పార్టీని 3వసారి గెలిపించడానికి పార్టీలో జగన్‌ దగ్గర చేరాను. పేదవాడు సంతోషంగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసి మైనార్టీల జీవితాల్లో జగన్‌ వెలుగులు నింపుతున్నారు. ఈ ప్రక్రియలో నేను రెండు నెలలు దూరంగా ఉన్నానగ. ఇప్పుడు తిరిగి పార్టీలో చేరాను. జగన్‌ ఇంకో 20, 30 సంవత్సారాలు అండగా నిలబడగలిగితే, ప్రజలు అండగా ఉంటే పేదలకు న్యాయం జరగుతుంది. వైనాట్‌ 175లో మేము కూడా భాగస్వామి కావాలి. 25 పార్లమెంటు స్థానాలు తిరిగి సాధించేందుకు కృషిచేస్తాను. మంగళగిరిలో ఏ అభ్యర్థిని ఇచ్చినా పూర్తిస్థాయిలో అన్‌ కండిషనల్‌గా పనిచేస్తానని జగన్‌కు చెప్పాను. ప్రతిపక్షాలు అన్ని కూడా రాజకీయంగా ఏకం అయ్యాయే అలానే నేటి పరిస్థితి ఉంది. జగన్మోహన్‌ రెడ్డి సారధ్యంలో అన్‌కండిషనల్‌గా పనిచేస్తాను. 2019లో నారా లోకేశ్‌ ఎలా ఓడిపోయారో 2024లో బీసీ అభ్యర్థి చేతుల్లో నారాలోకేష్‌ ఓటమి చెందుతారు’’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *