జగిత్యాల,తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా డిప్లమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే (పాలీసెట్`2024) ఎంట్రన్స్ పరీక్షను ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్స్, పాలీసెట్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆరు పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అందులో సుమారుగా 2,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సమయానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఓఏంఆర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు బ్లాక్ లేదా బ్లూ బాల్ పెన్ మాత్రమే వాడాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదని కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ సోమవారం ఒక ప్రకటనలో
తెలియజేశారు.