తాడేపల్లిగూడెం: ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా జగన్‌ సర్కార్‌ పాలన చేస్తుందని టీడిపి అధినేత చంద్రబాబు నాయుడు సతిమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో చంద్రబాబు నాయుడు జైలుకెళ్లిన సమయంలో బాధతో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం అమె నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమెకు పెదతాడేపల్లిలో టీడిపి నియోజకవర్గ ఇన్చార్జ్‌ వలవల బాబి, నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం కుంచనపల్లి తాడేపల్లి శేఖర్‌ కుటుంబాన్ని పరామర్శించి రూ.3 లక్షల చెక్కు అందించడంతోపాటు విూ కుటుంబానికి మేం ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్బంగా జనసేన, టీడిపి, బీజేపి కూటమి అభ్యర్థి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ తోపాటు ఆయన భార్య అనురాధ. కోడలు శ్రీదేవిప్రియ పసుపు కుంకుమలు, చీరలతో ఆడపడుచు లాంచనం అందిం. చారు. అదే విదంగా పటణంలో టీడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి గొర్రెల శ్రీదర్‌ తన సతీమణితో కలిసి హారతులు ఇచ్చి భువనేశ్వరికి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. అనంతరం పెంటపాడు మండలం పడమర విప్పర్రులో చంద్రబాబు అరెస్ట్‌ తటుకోలేక మృతి చెందిన కోడే అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆమెను తణుకు కూటమి ఆభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ. జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి పుష్పగుచ్చాలతో సత్కరించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *