— 18 మందిపై కేసులు.. రూ.2 లక్షల జరిమానా విధింపు
రాయచోటి: విద్యుత్ శాఖ డిపీఈ ఎస్ఈ శ్రీనివాసబాబు ఆదేశాల మేరకు విజిలెన్స్ డిఈ రమేష్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విద్యుత్ చౌర్యానికి పాల్పడిన పలు ఇండ్లలో దాడులు నిర్వహించారు. శనివారం నిర్వహించిన దాడులలో విద్యుత్ చౌర్యానికి.. అక్రమ విద్యుత్తు వాడుతున్న 18 మందిని గుర్తించి వారిపై రూ.2 లక్షల జరిమానాలను విధించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని.. విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎడీఈ మధులత, ప్రవీణ్ కుమార్, ఏఈలు నాగరాజు, రామాంజనేయరెడ్డి, రవి, నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఇంటిని తనిఖీలు చేస్తున్న విద్యుత్ విజిలెన్స్ అధికారులు