తిరుపతి: వైజాగ్‌ చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండిరగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. ఎస్‌. వెంకటేశ్వర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం ఉదయం స్థానిక కలెక్టర్‌ లోని సమావేశ మందిరం నందు జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తో కలిసి వైజాగ్‌ చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధిలో పనులలో భాగమైన 7 ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ లకు నీటి సరఫరా పనులు, భూసేకరణ, ఆక్రమణల విషయాలు తదితర అంశాలపై విసిఐసి, రెవెన్యూ, పిడి, నేషనల్‌ హైవే, ఎస్‌ ఈ, నీటిపారుదల, డీఎఫ్‌ఓ, అడవులు తదితర శాఖల వారితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వైజాగ్‌ చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండిరగ్‌ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు అంశాలపై అధికారులు దృష్టి పెట్టి త్వరిత గతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ సతీష్‌, గూడూరు ఆర్డీవో కిరణ్‌ కుమార్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ నెల్లూరు విజయ రత్నం, ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ చంద్రశేఖరయ్య, తెలుగు గంగ ప్రాజెక్టు ఎస్‌ ఇ మదన్‌ మోహన్‌, ఏపీఐఐసి స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం డిటి స్వామినాథన్‌, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *